తెలుగు యువ నటుల్లో తనదైన ముద్ర వేసుకుంటున్న అశ్విన్ బాబు, మరో ఆసక్తికర కథను అందించేందుకు సిద్ధమయ్యాడు. ఎం.ఆర్. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆయన తాజా సినిమా ‘వచ్చినవాడు గౌతమ్’. గణపతి రెడ్డి నిర్మాణంలో, అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై మంచి క్యూరియాసిటీని కలిగించింది. ముఖ్యంగా, టీజర్కు మంచు మనోజ్ ఇచ్చిన పవర్ఫుల్ వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. "అవతారాల ఆవిర్భావం ధర్మ స్థాపన కోసమే" అనే డైలాగ్ ద్వారా కథ నేపథ్యానికి స్పష్టత వచ్చింది. ఇది సినిమాకి ఒక గంభీరమైన టోన్ని అందించింది.
టీజర్ను చూస్తే, అశ్విన్ ఈసారి ఓ ధర్మయోధుడిగా కనిపించనున్నట్టు అర్థమవుతోంది. యాక్షన్, థ్రిల్, మరియు ఒక బలమైన నేపథ్యం కలగలిసినట్లు ఈ సినిమా కనిపిస్తోంది. గతంలోను తాను ప్రయోగాత్మక కథలతో ముందుకు వచ్చిన అశ్విన్, ఈసారి మరింత బలమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ సినిమాలో రియా సుమన్, అయేషా ఖాన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. విజువల్స్ పరంగా చూస్తే టీజర్ గ్రాండ్గా, టెక్నికల్గా బాగుంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా టీజర్కి మంచి బలాన్ని ఇచ్చాయి. ఇప్పటిదాకా విజయాలు, అపజయాలు కలగలిసినప్పటికీ, ప్రతి సినిమాతోనూ కొత్తదనాన్ని అన్వేషిస్తున్న అశ్విన్ బాబు 'వచ్చినవాడు గౌతమ్' ద్వారా మరొక కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడో చూడాల్సిందే!
0 Comments